Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: విమానంలో అస్వస్థతకు గురైన మహిళకు నిజామాబాద్​ జీజీహెచ్​ మాజీ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్​​ అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. విజయవాడ నుంచి హైదరాబాద్​ వస్తున్న విమానంలో హైదరాబాద్​కు చెందిన అనురాధకు హార్ట్​ ఎటాక్​ వచ్చింది. దీంతో ప్రతిమారాజ్ విమాన సిబ్బంది అందించిన మెడికల్ కిట్​​తో చికిత్స చేశారు. డాక్టర్ ప్రతిమారాజ్​ను విమాన సిబ్బంది, ప్రయాణికులు అభినందించారు.

Advertisement