అక్షరటుడే, వెబ్డెస్క్: ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్దాస్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శక్తికాంత్దాస్ తమిళనాడు క్యాడర్కు చెందిన 1980 బ్యాచ్ ఐఏఎస్. 2018 డిసెంబర్లో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టి గతేడాది రిటైర్డ్ అయ్యారు. తాజాగా ప్రధాని ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు.