అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్రంలో గులియన్ బారే సిండ్రోబ్ (జీబీఎస్) కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన ఓ మహిళకు ఈ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. కాగా ఈ వైరస్ ఇప్పటికే మహారాష్ట్రలో వంద మందికి పైగా సోకింది. ప్రమాదకరమైన ఈ వైరస్ మనిషి రోగనిరోధక శక్తిపై దాడి చేసి, బలహీనం చేస్తుంది. జీబీఎస్ సోకితే నరాల బలహీనత, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.