అక్షరటుడే, వెబ్​డెస్క్​: బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాస్త ధర తగ్గితే కొందామని అనుకుంటున్న వారికి షాక్​ ఇస్తూనే ఉన్నాయి. నిత్యం పసిడి ధరలు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాగే పెరిగితే రెండు మూడు రోజుల్లో తులం బంగారం రూ.90 వేలు దాటే అవకాశం ఉంది. హైదరాబాద్​ మార్కెట్​లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.88,530 పలుకుతోంది. 22 క్యారెట్ల ధర రూ.81,980గా ఉంది.