అక్షరటుడే, వెబ్​డెస్క్​: కేంద్ర బడ్జెట్​లో ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్​ చెప్పింది. దేశంలోని వెనకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. నీటి పారుదల సౌకర్యాలు, గోదాముల నిర్మాణం చేపడతామని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​ తెలిపారు. ప్రయోగాత్మకంగా వంద జిల్లాల్లో పీఎం ధన్​ ధాన్య కృషి యోజన అమలు చేస్తామని ప్రకటించారు. పప్పు ధాన్యాల కోసం ఆరేళ్ల ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామన్నారు. కిసాన్​ క్రెడిట్​ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతామని ప్రకటించారు. బీహార్​లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. కంది, మినుములు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పత్తి రైతుల ప్రయోజనం కోసం జాతీయ కాటన్​ మిషన్​ ఏర్పాటు చేస్తామన్నారు.