అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఇంగ్లాండ్​తో జరుగుతున్న ఐదో టీ‌‌20లో భారత ఓపెనర్​ అభిషేక్​ శర్మ సెంచరీతో రెచ్చిపోయాడు. 37 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేశాడు. దీంతో టీ20లలో వేగవంతంగా సెంచరీ చేసిన జాబితాలో మూడో స్థానానికి చేరాడు. డేవిడ్​ మిల్లర్​, రోహిత్​ శర్మ 35 బంతుల్లో సెంచరీతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్​లో భారత్ ​13 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.