అక్షరటుడే, వెబ్​డెస్క్​: రేవంత్​రెడ్డి ఓ మూర్ఖుడని కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ఎవరు తిట్టినా ఇలాగే మాట్లాడుతానని ఆయన పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్​లో నిర్వహించిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు దేశంలో పదోస్థానంలో ఉందన్నారు. అనంతరం బీఆర్​ఎస్​ పాలనలో నంబర్​వన్​ స్థానంలో నిలిచిందని నివేదికలే చెబుతున్నాయన్నారు. సాక్షాత్తు​ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెలువరించిన నివేదికలోనే ఈ వాస్తవాలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా కేసీఆర్​ను తిట్టడాన్ని మానేయాలని రేవంత్​రెడ్డిని హెచ్చరించారు.