అక్షరటుడే, వెబ్​డెస్క్​: కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీతో టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్​ మధుయాష్కీగౌడ్​ ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం. కులగణన సర్వేకు సంబంధించిన పలు అంశాలపై, సర్వేపై ప్రజల్లో వస్తున్న స్పందనను మధుయాష్కీ రాహుల్​ గాంధీకి వివరించినట్లు తెలిసింది.