అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్​గా మహేష్ కుమార్ పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన నిజామాబాద్ నగరపాలక సంస్థలో శానిటరీ ఇన్​స్పెక్టర్​గా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై ఎల్లారెడ్డికి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న శ్రీహరి రాజు పదోన్నతిపై బాన్సువాడ మున్సిపల్ కమిషనర్​గా వెళ్లారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్​ మహేశ్​కుమార్​ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.