అక్షరటుడే, ఆర్మూర్‌: నందిపేట్‌ మండలకేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్‌ మాట్లాడుతూ.. ముగ్గురు లబ్ధిదారులకు చెక్కులు అందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు దమ్మాయి శ్రీను, కాంతం, చిన్నయ్య, హైమద్, జమీల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.