అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా కోరారు. శుక్రవారం ఆయన నగరంలోని నాగారం రాజారాం స్టేడియం, తిలక్ గార్డెన్​లో వాకర్స్​ను కలిసి ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు కొమురయ్య, అంజిరెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.