అక్షరటుడే, నిజామాబాద్సిటీ: ఆత్మహత్య చేసుకున్న రైతు పీర్సింగ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి పరామర్శించారు. బాల్కొండలో శనివారం రైతు ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. రైతును పరామర్శించిన వారిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, మాజీ జెడ్పీ ఛైర్మన్ విఠల్రావు, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు ఉన్నారు.