అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్​ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు మోపాల్​ ఎస్సై యాదగిరి తెలిపారు. మండలంలోని కస్బాగ్​ తండాకు చెందిన హరిసింగ్​ ఆదివారం అర్ధరాత్రి ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.