అక్షరటుడే, వెబ్డెస్క్: ఢిల్లీ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇన్ఛార్జిగా ఉన్న రెండు స్థానాల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. కీలకమైన జంగ్పురా స్థానంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ గెలుపొందారు. అలాగే ఆర్కే పురం స్థానంలో అనిల్ శర్మ విజయం సాధించారు. పార్టీ గెలుపుకోసం కృషి చేసి అర్వింద్కు అభ్యర్థులు తర్విందర్ సింగ్, అనిల్ శర్మ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ వారిని సన్మానించారు.