అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరవ్యాప్తంగా పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిల లక్ష్యాలను త్వరగా పూర్తిచేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా బృందాలకు ఇచ్చిన టార్గెట్లను త్వరగా పూర్తి చేయాలని, సకాలంలో విధులకు హాజరుకావాలని సూచించారు.