అక్షరటుడే, వెబ్​డెస్క్​: అర్ధరాత్రి దుకాణాలు తెరవడానికి అనుమతించాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్​, నాయకులు కోరారు. ఈ మేరకు ఇన్​చార్జి సీపీ సింధుశర్మ, అదనపు డీసీపీ బస్వారెడ్డికి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13, 14 తేదీల్లో షబ్-ఎ-బరాత్‌, రంజాన్​ మాసం సందర్భంగా అహ్మదీ బజార్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ఖిల్లా రోడ్, బోధన్ చౌక్ ప్రాంతాల్లో అర్ధరాత్రి దుకాణాలు నిర్వహించుకోవడానికి అనుమతించాలని కోరారు. అలాగే రంజాన్​ మాసంలో నగరంలోని వన్​ టౌన్​, టూ టౌన్​ పోలీస్​ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్​ చలాన్లు మినహాయించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం మసీదుల వద్ద పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేయాలని కోరారు.