అక్షరటుడే, ఆర్మూర్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్​ చేసినట్లు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, నందిపేట ఎస్సై చిరంజీవి తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్​ నుంచి వచ్చి మండలంలోని వివిధ గ్రామాల్లో గంజాయి అమ్ముతున్న షేక్ అఫ్రోజ్​, షేక్ మహబూబ్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించామన్నారు. నిందితుల నుంచి రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.