అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన అర్సపల్లి రైల్వేగేట్ వద్ద చోటు చేసుకుంది. నిజామాబాద్ రైల్వేస్టేషన్ మేనేజర్ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్–జానకంపేట్ రైల్వేస్టేషన్ మధ్య అర్సపల్లి వద్ద ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. వివరాలకు నిజామాబాద్ రైల్వే పోలీస్ 8712658591 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.