అక్షర టుడే, నిజామాబాద్ సిటీ: ఢిల్లీలో జరుగుతున్న ఆర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సమావేశంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి శనివారం పాల్గొన్నారు. ఆర్చరీ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్, జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోశాధికారి జయిరీస్ పాల్, సహా కార్యదర్శి గుంగన్ అబ్రోల్, తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్, తదితరులు ఉన్నట్లు సంజీవ్రెడ్డి తెలిపారు.