అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: హైవేపై అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం కారును ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన డిచ్​పల్లి మండలం బీబీపూర్​ తండా వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది. నిజామాబాద్​ నగరానికి చెందిన హఫీజ్​ సయ్యద్​ అయుబ్​, మౌలానా మొయినుద్దీన్​, హఫీజ్​ షాహెద్​ రాజా, అబ్దుల్​ రెహ్మన్​లు ముషిరాబాద్​లో జరిగిన మతపరమైన కార్యక్రమానికి వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి వస్తుండగా బీబీపూర్​ తండా వద్ద జాతీయ రహదారిపై వీరి కారును గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో కారు బోల్తా పడి ఇద్దరికి తీవ్రంగా గాయపడగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్​ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అబ్దుల్​ రెహ్మన్​ మృతిచెందాడు. హఫీజ్​ సయ్యద్​ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్​ తరలించారు.