అక్షరటుడే, ఆర్మూర్: మద్యం తాగివ వాహనాలు నడిపిన కేసులో ఒకరికి జైలుశిక్ష పడింది. వేల్పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండలంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా రామన్నపేట్ గ్రామానికి చెందిన తెడ్డు రమేశ్ మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.