అక్షరటుడే, వెబ్డెస్క్: పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చాలా మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ఓటింగ్ సరళి కొంచెం వేరుగా ఉండటంతో ప్రతిసారి చాలా ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. అవగాహన లేకుండా తప్పుగా ఓటు వేస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
- బ్యాలెట్ పేపర్పై అభ్యర్థులకు ప్రాధాన్యత ప్రకారం ఓటు వేయాలి.
- మొదట నచ్చిన అభ్యర్థికి 1, తర్వాత 2, 3 ఇలా నంబర్లు వేస్తూ పోవాలి.
- 1, 2, 3 అనే అంకెలు మాత్రమే బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పక్కన వేయాలి.
- తెలుగులో ఒకటి, రెండు అని రాసినా, రోమన్ అంకెలు వేసినా ఓటు చెల్లదు.
- అభ్యర్థి పక్కన టిక్ మార్క్ పెట్టడం, బ్యాలెట్ పేపర్పై సంతకాలు చేయడం చేస్తే ఓటు వృథా అవుతుంది.
- ఎంత మంది అభ్యర్థులకు అయినా ప్రాధాన్యత ప్రకారం ఓట్లు వేయొచ్చు.
- ఒకే నంబర్ను ఇద్దరికి వేసినా, మధ్యలో ప్రాధాన్యత నంబర్ మిస్ అయినా ఆ ఓటును లెక్కించరు. ఉదాహరణకు నలుగురికి ఓటు వేయాలనుకొని ప్రాధాన్యత ప్రకారం 1,2, 4 అని రాస్తే అది చెల్లుబాటు కాదు. 1, 2, 3, 4 తప్పక వేయాలి.