అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఛాంపియన్స్​ ట్రోఫీలో భాగంగా భారత్​తో జరిగిన మ్యాచ్​లో పాకిస్తాన్​ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్​ చేశారు. పాక్​ బ్యాటర్లు షకిల్(62), రిజ్వాన్​ (46), కుష్​దిల్​ షా(38) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లు కుల్​దీప్​ యాదవ్​ 3, హార్దిక్​ పాండ్యా 2 వికెట్లు తీశారు.