అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంపై పీఎం మోదీ స్పందించారు. ఘటనపై శనివారం సాయంత్రం సీఎం రేవంత్​రెడ్డికి ఫోన్​ చేశారు. టన్నెల్​లో చిక్కుకున్న 8మందిని కాపాడేందుకు ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి సీఎం వివరించారు. మంత్రులు ఉత్తమ్​ కుమార్​రెడ్డి, కోమటి రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని వివరించారు. కేంద్రం నుంచి అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తామని మోదీ సీఎంకు భరోసా ఇచ్చారు.