అక్షరటుడే, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు జమ చేస్తోంది. 19 విడత పీఎం కిసాన్ నిధి కోసం శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నిధులను విడుదల చేశారు. దీంతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మూడుసార్లు నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.