అక్షరటుడే, బోధన్​: బోధన్​ మండలం పెగడపల్లిలో కరెంట్​షాక్​తో చనిపోయిన వారి మృతదేహాలను పోలీసులు రోడ్డు వరకు మోసుకు వచ్చారు. రెంజల్​ మండలం సాటాపూర్​ గ్రామానికి చెందిన గంగారాం, బాలమణి దంపతులు, వారి కుమారుడు కిషన్​ పొలంలో కరెంట్​ షాక్​తో మృతి చెందిన విషయం తెలిసిందే. పొలం నుంచి రోడ్డు వరకు వారి మృతదేహాలను సీఐ విజయ్​బాబు, పోలీసులు మోసుకొచ్చారు.