అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం పోలీసులు కవాతు నిర్వహించారు. ర్యాపిడ్ యాక్షన్ పోర్స్తో కలిసి ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజావెంకట్రెడ్డి, సీఐ సురేష్, ఎస్సైలు గంగాధర్, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.