అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: రూరల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని మారుతినగర్​లో ఓ వ్యభిచారం గృహంపై పోలీసులు దాడిచేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్​ఫోర్స్​ ఏసీపీ నాగేంద్రచారి తెలిపిన వివరాల ప్రకారం.. మారుతినగర్​లో వ్యభిచారం జరగుతుందనే సమాచారం మేరకు సోమవారం టాస్క్​ఫోర్స్​ ఇన్​స్పెక్టర్​ అంజయ్య, సీసీఎస్​ సిబ్బంది కలిసి వ్యభిచార గృహంపై రైడ్​ చేశారు. నలుగురు మహిళలను, ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3,600 నగదు, 4 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రూరల్​ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.