అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న గేమ్‌ ఛేంజర్‌ మూవీ ట్రైలర్‌ రిలీజ్ అయ్యింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌ ఏఎంబీ సినిమాస్‌లో గురువారం ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌రాజమౌళి విడుదల చేశారు. ఈ మూవీలో హీరోయిన్‌గా కీయారా అద్వానీ నటించారు. శంకర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మించారు. ఈమూవీ జనవరి10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.