అక్షరటుడే, వెబ్డెస్క్: ఐటీ సోదాలపై ప్రముఖ నిర్మాత దిల్రాజ్ స్పందించారు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇలాంటి తనిఖీలు సాధారణమన్నారు. ఐటీ అధికారులు అకౌంట్లు చూసి, స్టేట్మెంట్లు తీసుకున్నారని ఆయన చెప్పారు. తమ అకౌంట్లు క్లియర్గా ఉన్నాయని, డబ్బులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. ఫిబ్రవరి 3న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.