అక్షరటుడే, వెబ్​డెస్క్​: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భూటాన్​ పీఎం షెరింగ్​ టోబ్​గే ప్రశంసలతో ముంచెత్తారు. ఢిల్లీలో జరుగుతున్న సోల్​ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ తనకు సోదరుడిలాంటి వారని, ఆయనను కలిసిన ప్రతిసారి సంతోషంగా ఉంటుందన్నారు. మోదీ తనకు గురువని, మరింత కష్టపడి పనిచేయాలనే స్ఫూర్తిని ఆయన నుంచి పొందుతానని తెలిపారు.