అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్లోని నాగారంలో గల మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ కిరణ్గౌడ్ తెలిపారు. ఐదో తరగతిలో 80 సీట్లు, 6,7,8 తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్లు భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మైనారిటీ విద్యార్థుల్లో ముందు వచ్చిన వారికి సీట్లు కేటాయిస్తామని తెలిపారు. నాన్ మైనారిటీలో వచ్చిన దరఖాస్తులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9010456538 నంబర్ను సంప్రదించాలన్నారు.