అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ కమిషనర్గా రాజేందర్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ అడిషనల్ కమిషనర్గా పనిచేసిన రాజేందర్ రెడ్డి పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా డిసెంబర్ 19న మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన స్పందన నెల 10 రోజుల పాటు ఇక్కడ విధులు నిర్వర్తించి రంగారెడ్డి మెప్మా పీడీగా వెళ్లారు.