అక్షరటుడే, వెబ్​డెస్క్​: టీం ఇండియా క్రికెటర్​ రిషబ్​ పంత్​ పెద్ద మనుసు చాటుకున్నారు. తనకు యాడ్​ల ద్వారా వచ్చే ఆదాయంలో పది శాతం రిషబ్​ పంత్​ ఫౌండేషన్​కు ఇస్తున్నట్లు సోషల్​ మీడియాలో ప్రకటించారు. ఈ మేరకు ఆయన వీడియో పోస్ట్​ చేశారు. తనకు క్రికెట్​, అభిమానులు ఎంతో ఇచ్చారని.. సమాజానికి తిరిగి ఇవ్వడానికి ఇదే మంచి సమయం అని పేర్కొన్నారు. ఫౌండేషన్​ ద్వారా పేదలకు సాయం చేయనున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని ఆయన తెలిపారు.