అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: అర్బన్​ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారులకు తప్పుడు అఫిడవిట్​లు అందజేశారని సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడు ఆదె ప్రవీణ్​కుమార్​ ఆరోపించారు. నగరంలోని కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాక్లూర్​ మండలంలో 9.16 ఎకరాలను కేవలం రూ. 4 లక్షలకే కొన్నట్లు అధికారులకు ఇచ్చిన పత్రాల్లో చూపారని.. కానీ ఆ ఆస్తి విలువ రూ. 2.70 కోట్లు ఉందన్నారు. ఇలా ఆయన అఫిడవిట్​లో తప్పుడు సమాచారం ఇచ్చి అధికారులను, నగర ప్రజలను మోసం చేశారని.. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.