అక్షరటుడే, ఎల్లారెడ్డి: గాంధారి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో రమేష్ఇ బ్బందికర చేష్టలు చేస్తూ.. అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లు ఫిర్యాదు అందిందన్నారు. సదరు ఉపాధ్యాయుడు సదాశివనగర్ మండలం ఉత్నూర్ గ్రామానికి చెందినవాడు. 2024లో డీఎస్సీ ద్వారా నాలుగు నెలల క్రితమే గాంధారి పాఠశాలలో మొదటి పోస్టింగ్ పొందాడు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అతడి వ్యవహారశైలి కొంచెం తేడాగా ఉండేదని పాఠశాలలో పనిచేసే కొంత మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతున్నట్లు ఎస్సై వివరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.