అక్షరటుడే, బోధన్​: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్​ను సీజ్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. టాస్క్​ఫోర్స్​ ఇన్​స్పెక్టర్​ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాపూర్​లో ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న టిప్పర్​ను పట్టుకుని సీజ్​ చేశారు. అనంతరం నవీపేట్​ పోలీస్​స్టేషన్​కు అప్పజెప్పామని పోలీసులు తెలిపారు.