అక్షరటుడే, వెబ్​డెస్క్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈఏపీసెట్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఇంజినీరింగ్​, ఫార్మసీ, అగ్రికల్చర్​ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు ఈ నెల 25 నుంచి ఏప్రిల్​ 4 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్​ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులకు రూ.900. ఏప్రిల్​ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్​, ఫార్మసీ ఎంట్రెన్స్​ పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్​ పరీక్షలు మే 2 నుంచి 5 వరకు జరగనున్నాయి.