అక్షరటుడే, వెబ్డెస్క్: SLBC టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్, సైన్యం సహకారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు తీవ్రంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నాగర్ కర్నూల్ కలెక్టర్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ.. తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారన్నారు. త్వరలోనే వారు సురక్షితంగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.