అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఢిల్లీ ఏఐసీసీ ​అధినాయకులతో తెలంగాణ నేతలు శుక్రవారం భేటీ కానున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్‌ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రేపు 11 గంటలకు రాష్ట్ర రాజకీయాలపై వారితో చర్చించనున్నారు. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు.. మంత్రులపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు హైదరాబాద్​లో జరిగిన సీఎల్పీ సమావేశంలో కూడా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలపైనే చర్చించారు. దీంతో రేపటి ఢిల్లీ టూర్​ సర్వత్రా ఆసక్తిగా మారింది.