అక్షరటుడే, వెబ్డెస్క్ : దళిత బంధు పథకం లబ్ధిదారులు హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందు ధర్నా నిర్వహించారు. వచ్చేవారం జరిగే కేబినెట్ భేటీలో దళిత బంధు నిధుల విడుదలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల లోపు దళిత బంధు నిధులను విడుదల చేస్తామని హామీ ఇవ్వకుంటే ఆందోళనలను ఉధ్రుతం చేస్తామని లబ్ధిదారులు స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి విడుత దళిత బంధు పథకం కింద 500 లమంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కొక్కొరికి రూ. 10లక్షలు అందించారు. ఈ పథకం అమలులో భారీగా అక్రమాలు జరిగాయని విమర్శలు ఉన్నాయి.
Advertisement
Advertisement