అక్షరటుడే, వెబ్డెస్క్: తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ అయింది. ఇటీవల గ్రామంలోని కోళ్ల ఫామ్లో కోళ్లు చనిపోయాయి. వాటి నమూనాలను అధికారులు ల్యాబ్కు పంపగా బర్డ్ ఫ్లూగా తేలింది. దీంతో స్థానిక ప్రజల్లో భయం మొదలైంది. మరోవైపు వైరస్ భయంతో ఇప్పటికే చాలా చోట్ల చికెన్ అమ్మకాలు తగ్గిపోయాయి.