అక్షరటుడే, వెబ్డెస్క్: బీజేపీ అధినాయకత్వం రాష్ట్రంలోని పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా జిల్లాలకు కూడా నియమించిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
కొత్త అధ్యక్షులు వీరే..
హైదరాబాద్ – లంక దీపక్ రెడ్డి
నిజామాబాద్ – దినేష్ కులాచారి
కామారెడ్డి – నీలం చిన్న రాజులు
భూపాలపల్లి – నిశిధర్ రెడ్డి
హనుమకొండ – కొలను సంతోష్ రెడ్డి
వరంగల్ – గంట రవికుమార్
నల్లగొండ – నాగం వర్షిత్ రెడ్డి
జగిత్యాల – రాచకొండ యాదగిరి బాబు