అక్షరటుడే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో సీబీఐ మెరుపు దాడులు చేసింది. ఏకకాలంలో 20 విద్యాసంస్థల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. గుంటూరులోని కేఎల్‌ వర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసింది. NAAC రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్లు కేఎల్‌ వర్సిటీ యాజమాన్యంపై ఆరోపణలున్నాయి. మొత్తం 14 మందిపై సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 10 మందిని అరెస్టు చేయగా.. వారిలో NAAC ఇన్‌స్పెక్షన్ టీమ్‌ ఛైర్మన్ సమరేంద్ర తదితరులున్నారు. వీరి నుంచి రూ.37 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల జాబితాలో వర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, NACC మాజీ డిప్యూటీ అడ్వైజర్‌ మంజునాథరావు, NACC అడ్వైజర్ శ్యామ్ సుందర్, డైరెక్టర్ హనుమంతప్ప తదితరుల పేర్లు ఉన్నాయి.