అక్షరటుడే, వెబ్​డెస్క్: రాష్ట్రంలో కొత్తగా ఎంపికైన జూనియర్​ లెక్చరర్​ అభ్యర్థుల కౌన్సెలింగ్​ ప్రక్రియ ముగిసింది. 1,286 మంది అభ్యర్థులకు ఈ నెల 13 నుంచి 19 వరకు కౌన్సెలింగ్​ చేపట్టారు. ఇందులో మల్టీజోన్​‌‌–1కు 659 మందిని, మల్టీ జోన్–2కు 627 మంది అభ్యర్థులను కేటాయించారు. మెరిట్​ ఆధారంగా కాలేజీలకు లెక్చరర్లను ఎంపిక చేశారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టినట్లు ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు.