అక్షరటుడే, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న వేంకటేశ్వర స్వామిని 74,742 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,466 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.3.67 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.