అక్షరటుడే, వెబ్​డెస్క్​: దర్శకుడు శంకర్​కు ఈడీ షాక్​ ఇచ్చింది. ఆయనపై మనీ లాండరింగ్​ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా రూ.10.11 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. తన పుస్తకం నుంచి రోబో సినిమా కథ కాపీ కొట్టారని తమిళనాదన్​ అనే రచయిత కోర్టును ఆశ్రయించాడు. కోర్టు కేసు ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ ఆస్తులను అటాచ్‌ చేసింది.