అక్షరటుడే, వెబ్​డెస్క్: హైదరాబాద్​ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఫాల్కన్​ స్కాంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇన్వాయిస్​ డిస్కౌంట్ పేరిట పెట్టుబడులపై 11 నుంచి 22శాతం రిటర్న్​ ఇస్తామని ఈ కంపెనీ ప్రజలను నమ్మించింది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 6900 మంది రూ.1700 కోట్లు డిపాజిట్​ చేశారు. ఇందులో రూ.850 కోట్లను డిపాజిటర్లకు తిరిగి చెల్లించిన కంపెనీ మిగతా నిధులను దుర్వినియోగం చేసింది. ఆ డబ్బులను ఇతర దేశాలకు తరలించారు. ఢిల్లీకి చెందిన పలువురి బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్​ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మనీ లాండరింగ్​ జరగడంతో ఈడీ తాజాగా కేసు నమోదు చేసింది. డబ్బులను 22 డొల్ల కంపెనీలకు తరలించినట్లు గుర్తించింది.

ప్రధాన నిందితులు దుబాయిలో..

ఫాల్కన్​ స్కాంలో సైబరాబాద్​ పోలీసులు ఫాల్కన్​ క్యాపిటల్​ ప్రొటెక్షన్​ ఫోర్స్​ వైస్​ ఛైర్మన్​ ఓదెల పవన్​ కుమార్​, డైరెక్టర్​ కావ్య, మేనేజర్​ అనంతను గతంలోనే అరెస్ట్​ చేశారు. అయితే ప్రధాన నిందితులు ఫాల్కన్​ డైరెక్టర్​ అమర్​ దీప్​ కుమార్​, చీఫ్​ ఆపరేటింగ్​ ఆఫీసర్​ ఆర్యన్​ సింగ్​, సీఈవో యోగేందర్​ సింగ్​ దుబాయి పారిపోయారు.