అక్షరటుడే, ఆర్మూర్: ఆలూర్లో వెయ్యి నామాల వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్రెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ ఆలూరు మండలాధ్యక్షుడు ముక్కెర విజయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.