అక్షరటుడే, వెబ్​డెస్క్​: ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న కుంభమేళాకు ప్రధాని మోదీ బుధవారం ఉదయమే చేరుకున్నారు. అనంతరం కుంభమేళాలోని అరైల్​ ఘాట్​లో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం గంగానదికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఉన్నారు.